News August 4, 2024

జనరల్ బోగీ ఎక్కితే చుక్కలే..!

image

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైల్వే సామాన్యులకు దూరమవుతోంది. ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా AC బోగీలు పెంచుతూ, జనరల్ బోగీలు తగ్గించడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్ బోగీలను 4 నుంచి ఒకటికి తగ్గించడంతో ప్రయాణం నరకమైంది. ఒకే ఒక్క బోగీ కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది టాయిలెట్ల వరకూ కూర్చుని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

Similar News

News March 17, 2026

ఆరేళ్ల పదవీ కాలం.. ఒక్క ప్రశ్నా అడగలేదు!

image

మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ MP పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆరేళ్లలో ఆయన అటెండెన్స్ 53% ఉండగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 2023లో AUGలో ఢిల్లీ సర్వీసెస్ బిల్‌పై చర్చలో మాత్రమే పాల్గొన్నారు. కాగా 2020 మార్చి 16న ఆయనను RSకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని 2021లో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

News March 17, 2026

హైదరాబాద్‌లో UK స్కూల్స్!

image

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.

News March 17, 2026

IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

image

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT