News August 4, 2024
GREAT.. సిరిసిల్ల విద్యార్థికి నీట్లో రాష్ట్రస్థాయి 136వ ర్యాంక్

సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన ప్రణీత నీట్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంకు సాధించింది. జాతీయస్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో 720 మార్కులకు 678 మార్కులతో 8,100వ ర్యాంకు సాధించింది. దీంతో పలువురు ఆమెను అభినందించారు. కాగా, ప్రణీత సోదరి కూడా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
Similar News
News February 7, 2026
KNR: SRR ప్రభుత్వ కళాశాల ప్రవేశాల కరపత్రం ఆవిష్కరణ

SRR ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో రాబోయే విద్యా సంవత్సరం 2026-27 ప్రవేశాల కరపత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె.రామకృష్ణ అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SRR కళాశాల ప్రస్తుత సంవత్సర అడ్మిషన్లలో రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇదేవిధంగా అడ్మిషన్లు రావడానికి అధ్యాపకులు అందరూ కృషి చేయాలన్నారు.
News February 7, 2026
KNR: అభివృద్ధిని అడగని ఓటర్లు..!

ఉమ్మడి KNRజిల్లా మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ వేరు. ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి. వాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలపై అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడం మానేశారు. “ఎవరు ఎంత ఇస్తున్నారు? ఏ పార్టీ మందు పోస్తోంది?” అనే చర్చపైనే ప్రధాన దృష్టి సారించారు. అభ్యర్థులు కూడ కేవలం ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
News February 7, 2026
KNR:అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులు: కలెక్టర్

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28కి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


