News August 4, 2024

ప్రభుత్వ ITIలో మూడో విడత ప్రవేశాలు

image

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, టీసీ, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్ తీసుకువెళ్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 12, 2026

గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

image

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

News March 12, 2026

గుంటూరు: పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 133 మంది కేసులు

image

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 133 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 58 ఎఫ్‌ఐఆర్‌లు, 60 పెట్టి కేసులు ఉన్నాయి. బహిరంగ మద్యపాన రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.