News August 4, 2024
సాగర్ జల సవ్వడులకు నేటితో 57 ఏళ్లు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మొట్టమొదటిసారి నీటిని విడుదల చేసి నేటితో 57ఏళ్లు నిండాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్!

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.
News November 11, 2025
NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్స్పాట్లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్ బస్సులకు సైడ్ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News November 10, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు


