News August 4, 2024
ఎర్రగుంట్ల: కొడుకు చేసిన అప్పులకు తండ్రి ఆత్మహత్య

ప్రొద్దుటూరు లోని నాగేంద్ర నగర్ కు చెందిన వెంకటరామిరెడ్డి అదే పట్టణంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన కుమారుడు చేసిన అప్పులకు సంబంధించి కమలాపురం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంతో ఇటీవల వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారు అధ్యాపకుడి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి శనివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News March 15, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 282 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనల పాటించని 282 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి రూ.58,340లు జరిమానాగా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు.
News March 14, 2026
కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.
News March 14, 2026
అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.


