News August 4, 2024

OLYMPICS: గ్రేట్ బ్రిటన్‌తో భారత్ ఢీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో క్వార్టర్‌ఫైనల్‌లో తలపడుతోంది. ఈ గేమ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. గ్రూప్ దశలో కేవలం ఒక గేమ్ మాత్రమే ఓడిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన జోరును కొనసాగించాలని, బ్రిటన్‌ను చిత్తు చేయాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌, జియోసినిమా వెబ్‌సైట్, యాప్‌లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతోంది.

Similar News

News January 29, 2026

RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

image

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్‌ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

News January 29, 2026

ఉపవాసంలో ఏయే పదార్థాలు తీసుకోవచ్చు?

image

ఏకాదశి ఉపవాసంలో ధాన్యాలకు(బియ్యం, గోధుమలు) దూరం ఉండాలి. పాలు, పెరుగు, వెన్న వంటి పాడి పదార్థాలు కొద్దిమేర తీసుకోవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా తినవచ్చు. జ్యూస్ చేసుకుంటే మాత్రం చక్కెరకు దూరం ఉండటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణ ఉప్పు వాడకూడదట. బదులుగా సైంధవ లవణం వాడాలని పండితులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతుండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తినొచ్చు.

News January 29, 2026

మొక్కజొన్న ఆకులు ఈ రంగులోకి మారాయా?

image

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.