News August 4, 2024
9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 965 కి.మీ మైలేజీ!

విద్యుత్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్, మైలేజీ అతి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. వీటి వలన ప్రజలు ఈవీలవైపు మొగ్గుచూపడం లేదు. సాంసంగ్ సంస్థ 2027 కల్లా దీనికి పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు చూస్తోంది. కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయి 965 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బ్యాటరీని సంస్థ తయారుచేసింది. ఏ వాహనంలోనైనా దీన్ని వాడుకోవచ్చని 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని చెబుతోంది. అయితే, ఎక్కువ ధర ఉండనుందని సమాచారం.
Similar News
News January 1, 2026
X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 1, 2026
నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.
News January 1, 2026
బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సజీవ దహనానికి యత్నం

బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా షరియత్పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే హిందువుపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. డిసెంబర్ 31న ఇంటికి వెళ్తున్న అతడిపై కత్తులతో అటాక్ చేసి తీవ్రంగా కొట్టి ఆపై నిప్పు పెట్టారు. దగ్గర్లో ఉన్న చెరువులోకి దూకి అతడు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృత్ మండల్, దీపూ దాస్ వంటి వారూ ఇలాంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.


