News August 4, 2024

రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

image

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

Similar News

News February 17, 2026

గుంటూరులో CBSE టెన్త్ పరీక్షలు షురూ

image

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.

News February 17, 2026

గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.

News February 17, 2026

గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.