News August 4, 2024
ప.గో జిల్లాలో ‘ఫ్రెండ్షిప్ డే’న విషాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఫ్రెండ్షిప్ డే’న విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్లో కె.జాన్బాబు(17) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాన్బాబు తణుకుకు చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం.. అందులోనూ ఫ్రెండ్షిప్ డే కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా పేరుపాలెం బీచ్ వెళ్లాడు. స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.
Similar News
News December 29, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: జేసీ

రబీ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుండి రైతు ప్రతినిధులు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన సమీక్షించారు. అన్ని మండలాల్లో అవసరమైన మేర నిల్వలు ఉండేలా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సాగు అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 29, 2025
SP హెచ్చరిక.. నిబంధనల మధ్యే న్యూ ఇయర్కి స్వాగతం

నూతన సంవత్సర వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
News December 29, 2025
కలెక్టర్కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.


