News August 4, 2024

నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతా: షబ్బీర్ అలీ

image

నిజామాబాద్ పట్టణాన్ని రూ.300 కోట్ల అమృత్ నిధుల ద్వారా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు పరిస్కరిస్తానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు.

Similar News

News March 12, 2026

నిజామాబాద్ GGHలో వరల్డ్ కిడ్నీ డే

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని డయాలసిస్ కేంద్రంలో గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాస్ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని సూచించారు. డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

News March 12, 2026

NZB: వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు: DMHO

image

ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తికి పాల్పడితే వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని NZB DMHO డా.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం నిర్వహించిన గర్భస్త పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీలో నమోదు అయిన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని సూచించారు.

News March 12, 2026

NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.