News August 4, 2024
ప్లాట్ఫామ్ ఫీజు రూ.83 కోట్లు.. రాత్రి ఎక్కువ ఆర్డర్లు ఎక్కడి నుంచంటే?

ప్లాట్ఫామ్ ఫీజు, ఆర్డర్లు పెరగడంతో జొమాటో లాభాలు నమోదు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి PF ఫీజు రూ.83 కోట్లు వసూలు చేసింది. గతేడాది AUGలో రూ.2తో ఈ ఫీజును ప్రారంభించిన జొమాటో ఇప్పుడు రూ.6 వసూలు చేస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో జొమాటో సర్దుబాటు ఆదాయం 27% పెరిగి రూ.7,792 కోట్లుగా ఉంది. మరోవైపు గతేడాది రాత్రి పొద్దుపోయాక ఎక్కువ ఆర్డర్లు ఢిల్లీ నుంచి, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్లు బెంగళూరు నుంచి అందాయి.
Similar News
News March 6, 2026
TODAY HEADLINES

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
News March 6, 2026
తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు.
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.


