News August 4, 2024

షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంతో తల్లీకొడుకు మృతి

image

షాద్‌నగర్ పరిధిలోని నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. స్థానిక జీపీ దర్గాకు వెళ్లి వస్తుండగా స్కూటీ, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతులు అంజద్‌బేగం(35), అబ్దుల్‌ రెహమాన్‌ (12)గా గుర్తించారు. మరో కొడుకు రహీం (9)కి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News March 12, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.

News March 12, 2026

ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి ముప్పు

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి రానున్న కాలంలో ముప్పు తలపించే అవకాశం ఉందని దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తుతుమంత్రంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. మొత్తానికి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్రషర్ మిషన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఉండే ఏడుకొండలను తవ్వాలని ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.

News March 12, 2026

MBNR: SZ..16,17న KHO-КНО ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 16న స్త్రీలకు, 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్. శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తో హాజరు కావాలన్నారు. SHARE IT