News August 5, 2024
అల్లూరి జిల్లాలో గుండెలు పిండేసిన ఘటన

కొడుకు మృతదేహం పట్టుకుని నడిరోడ్డుపై తల్లిదండ్రులు రోదించిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెంకొత్తవిధి మండలం తిరుమలబంధకి చెందిన కార్తీక్కి గుండె నొప్పి రావడంతో విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించుకొని తిరిగి ఆదివారం తల్లిదండ్రులు తమ చుట్టాల ఇంటికి తీసుకు వెళుతుండగా అరకు సమీపంలో ఆ బాలుడు మృతి చెందాడు. రోడ్డుపైనే మృతదేహంతో సుమారు మూడు గంటల పాటు రోదిస్తూ ఉండిపోయారు.
Similar News
News March 10, 2026
విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,35,000 చలానా విధించారు.
News March 10, 2026
మధురవాడ: మహిళా దినోత్సవం వేడుకలు.. పురుషులకు వంట పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వాంబేకాలనీలో వినూత్నంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంగా జరిగిన ఈ పోటీలలో స్థానిక పురుషులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
News March 10, 2026
కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


