News August 5, 2024
MBNR: ‘దోస్త్’ ప్రవేశాలకు నేడు చివరి అవకాశం!

డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లకు సోమవారంతో గడువు ముగియనుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తెలిపారు. ప్రవేశాలకు ఆగస్టు 2న గడువు ముగియడంతో ప్రత్యేక గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులై ఉండి తొలి, మలి, చివరి విడత ప్రవేశాల్లో సీట్లు పొందని వారికి ఇది చక్కటి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 19, 2026
MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.
News March 19, 2026
MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.
News March 19, 2026
MBNR: ఉగాది సుఖ సంతోషాలు నింపాలి: SP

తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.


