News August 5, 2024

మలేషియాలో సత్తాచాటిన మదనపల్లె విద్యార్థులు

image

మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో మదనపల్లె విద్యార్థులు సత్తా చాటి బ్లాక్ బెల్ట్ సాధించినట్లు మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేశ్ తెలిపారు. విద్యార్థులు మహేశ్వర్, షేక్ మిస్బా, జోషితారెడ్డి , మహమ్మద్ ఐమాన్ , మోహిబుల్ రెహమాన్, విశిష్టసాయి , కాలేషామస్తాన్ , చారుకేశరాయల్ , ప్రజ్వల్ రాయల్ బ్లాక్ బెల్ట్ సాధించారన్నారు. వారంతా ఆదివారం మదనపల్లెకు రావడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.

Similar News

News February 21, 2026

పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

image

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్‌లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.

News February 21, 2026

చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

image

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.

News February 21, 2026

చిత్తూరు: పోలీసుల శ్రమదానం

image

స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటారు.