News August 5, 2024

కడప: ‘వెంటనే టీచర్ల సర్దుబాటు నిలిపివేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేయడంతో తీరని నష్టం జరుగుతోందని, వెంటనే నిలిపివేసి పదోన్నతులు కల్పించాలని.. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. విద్యారంగానికి తీరని నష్టం కలిగించే 117 జీవోను రద్దు చేస్తామని చెప్పిన నారా లోకేశ్ టీచర్ల సర్దుబాటు చేయటం సమంజసం కాదన్నారు.

Similar News

News February 23, 2026

పులివెందులకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న పర్యటించే షెడ్యూల్‌ను వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 10:30కి వేంపల్లి మండలం నంది పల్లె నందీశ్వర ఆలయానికి చేరుకుంటారు. తిరిగి 11:30కి అక్కడి నుంచి బయలుదేరి 12:30కి బాకరాపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 నుంచి 6: 25 వరకు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 6:30కి ఇంటికి చేరుకొని అక్కడే బసచేస్తారు.

News February 23, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా

image

*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,750
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,490
*వెండి 10 గ్రాముల ధర రూ.2,700

News February 23, 2026

రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

image

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.