News August 5, 2024
సిరికొండ: టీచర్పై సస్పెన్షన్ వేటు

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం బోధించే టీచర్ పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పద్మజ సిరికొండ మండలంలోని కొండూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయులు మాత్రం కొండూరులో జాయిన్ కాలేదు.
Similar News
News March 4, 2026
UPDATE: పట్టుబడిన ముఠా సభ్యులు వీరే: CP

అంతర్ రాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను NZB పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠాలో అఫ్జల్ ఖాన్, అర్బాజ్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు CP సాయి చైతన్య చెప్పారు. ఆన్సర్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు.
News March 3, 2026
NZB: CM రేవంత్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.
News March 3, 2026
భారతీయుల కోసం 24/7 హెల్ప్ లైన్ సేవలు!

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమని పేర్కొన్నారు.


