News August 5, 2024
సీఎం మీటింగ్లో కలెక్టర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, విజయనగర జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు.
Similar News
News March 11, 2026
VZM: ఇన్స్టాగ్రామ్ లవ్..చివరికి జైలు పాలు

ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో కొండవెలగాడ గ్రామానికి చెందిన నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానాను బుధవారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నెల్లిమర్ల PSలో నమోదైన ఈ కేసులో నేరం నిరూపితమవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.
News March 11, 2026
VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.
News March 11, 2026
VZM: కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సదస్సు ప్రారంభం

విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సుస్థిర రసాయన శాస్త్రం–2026” అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. సదస్సులో సుస్థిర రసాయన పరిశోధనల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.


