News August 5, 2024
ACA త్రిసభ్య కమిటీ సభ్యుడిగా మాంచో ఫెర్రర్

అనంతపురం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడిన ఆర్డీటీ పీడీ మాంచో ఫెర్రర్కు ఆంధ్ర క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా చోటు దక్కింది. ఏసీఏ కమిటీ ఇటీవల రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి నుంచి రంగారావు, అనంతపురం నుంచి మాంచో ఫెర్రర్లను నియమించారు. వచ్చే నెలలో ACA ఎన్నికలు జరగనుండగా అప్పటివరకు వీరు కార్యకలాపాలను నిర్వహిస్తారు.
Similar News
News March 12, 2026
అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.
News March 12, 2026
అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 12, 2026
ప్రత్యేక అధికారులను నియమించనున్న జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.


