News August 5, 2024
కర్నూల్: ఆస్తి గొడవ.. కొడుకు చేతిలో తండ్రి మృతి

ఆస్తి తగాదాలతో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణలో తండ్రి తలకు గాయమై మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జమ్మలదిన్నెలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జమ్మలదిన్నె గ్రామానికి చెందిన కోసిగి తిక్కయ్య-సిద్దమ్మ దంపతుల పెద్ద కుమారుడైన రాముడు ఇంటి స్థలం విషయంలో తండ్రి తిక్కయ్య (63)తో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో తోయడంతో తిక్కయ తల గోడకు తగిలి రక్తస్రావం అయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.
Similar News
News March 15, 2026
కర్నూలులో ‘ఆకలి కేక’

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.
News March 15, 2026
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.


