News August 5, 2024

కొన్న రెండ్రోజుల్లోనే పాడైన బైక్.. OLAకి భారీ జరిమానా!

image

‘OLA’ కంపెనీకి జిల్లా వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. సదరు కంపెనీకి చెందిన స్కూటర్‌ను జహీరాబాద్‌కు చెందిన మద్ది డేవిడ్‌ జులై 3, 2023న కొనుగోలు చేశారు. రెండు రోజులకే పాడవడంతో కంపెనీని సంప్రదించగా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో అతను సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు కస్టమర్‌కు రూ.1,92,205 చెల్లించాలని కంపెనీని తాజాగా ఆదేశించింది.

Similar News

News October 19, 2025

నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: పవన్

image

AP: ప్రజలకు Dy.CM పవన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఆ స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ఓడించారు. ఆ అక్కసుతో మారీచుల్లాంటి ఈ నరకాసురులు రూపాలు మార్చుకుంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

News October 19, 2025

ఆర్మీలో 90 ఆఫీసర్ ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ జులై 2026లో ప్రారంభమయ్యే 55వ 10+2 TES కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌ (M.P.C)లో 60% మార్కులతో పాసై, JEE మెయిన్స్-2025 అర్హత సాధించినవారు NOV 13వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా 90మందిని ఎంపిక చేస్తారు. 4ఏళ్ల ట్రైనింగ్ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం లభిస్తుంది.

News October 19, 2025

మా సాయాన్ని మరిచారు: అఫ్గాన్‌పై షాహిద్ అఫ్రీది ఫైర్

image

అఫ్గాన్‌పై పాక్ Ex క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఫైరయ్యారు. తమ సాయాన్ని ఆ దేశం మరచిపోయినట్లుందని మండిపడ్డారు. ‘ఇలా జరుగుతుందని ఊహించలేదు. 50-60 ఏళ్లుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నేను 350 అఫ్గాన్ ఫ్యామిలీస్‌కు సాయం చేస్తున్నా’ అని అన్నారు. రెండూ ముస్లిం దేశాలు కాబట్టి సహకరించుకోవాలన్నారు. పాక్‌లో టెర్రరిజం సాగిస్తున్న వారితో అఫ్గాన్ చేతులు కలపడం విచారకరమని పరోక్షంగా భారత్‌పై అక్కసువెళ్లగక్కారు.