News August 6, 2024

కంప్యూటర్లో మార్పులతో భూములు కాజేశారు: సీఎం

image

AP: ప్రజలతో అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు అన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి నెలకొందని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. గత ప్రభుత్వం కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పులు చేసి భూములు కాజేసిందన్నారు. భూములను ఫ్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని దుయ్యబట్టారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు.

Similar News

News November 11, 2025

చక్కటి కురులకు చక్కెర స్నానం

image

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.