News August 6, 2024
పార్వతీపురం యువకునికి 20ఏళ్ల జైలుశిక్ష

అనకాపల్లి జిల్లాకు చెందిన అమ్మాయిని మోసగించిన కేసులో పార్వతీపురానికి చెందిన పి.సాయి మనోజ్ కుమార్కు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధించింది. భోగాపురం సమీపంలో చదువుతున్న రోజుల్లో సాయి మనోజ్తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు స్థానిక పోలీసుస్టేషన్లో ఆమె కేసు పెట్టింది.
Similar News
News March 18, 2026
అన్నదాత సుఖీభవ హామీ ఎక్కడ: చిన్న శ్రీను

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం విజయనగరంలోని ధర్మపురి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
News March 18, 2026
VZM: జిల్లా వాసులకు ముఖ్య గమనిక..!

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.
News March 18, 2026
VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.


