News August 6, 2024
టీచర్ల కొరత ఉంటే విద్యా వాలంటీర్ల నియామకం: సీఎం చంద్రబాబు

AP: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోస్టులు ఖాళీగా ఉన్న చోట చదువు నాణ్యత దెబ్బతినకుండా విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కూల్లో ఉండేలా చూడాలని, ఆ తర్వాత వారిని ప్రభుత్వ బడిలోకి తీసుకురావడంపై ఆలోచించొచ్చని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలన్నారు.
Similar News
News March 25, 2026
ఆముదం మొక్కల కొమ్మల కత్తిరింపుతో లాభాలు(1/2)

ఆముదం సాగులో భాగంగా మొక్కల తలలను తుంచడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నీటి వసతి ఉన్న సారవంతమైన భూముల్లో ఆముదం మొక్క తలను చేతితో కాని, కత్తితో గాని ఒక మొగ్గను ఉంచి మిగిలిన కొమ్మలను తుంచడం వల్ల మొగ్గ బాగా పెరుగుతుంది. మొదటిసారి ఆముదం విత్తిన 45-50 రోజులకు మొదటి కొమ్మను ఉంచి మిగిలిన కొమ్మలను తీసివేయాలని చెబుతున్నారు.
News March 25, 2026
వరకట్న వేధింపులకు 1,304 మంది బలి

AP, TGలో గత 5ఏళ్లలో 1,304 మంది మహిళలు వరకట్న వేధింపులతో మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. TDP MP బైరెడ్డి శబరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు APలో 526, TGలో 778 కేసులు నమోదయ్యాయి. శిక్షల ఖరారు రేటు APలో 11.5%, TGలో 14.4%గా ఉంది. వరకట్న మరణాల్లో UP, బిహార్ టాప్లో ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 6,156 మంది కట్నం వేధింపులతో చనిపోయారు.
News March 25, 2026
పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


