News August 6, 2024
కడప: గణితశాస్త్రంలో మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్

గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News January 1, 2026
ప్రొద్దుటూరు: వారం రోజుల్లో తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల వ్యవధిలో రూ.5510 మేర తగ్గింది. ఇవాళ 10 గ్రాముల ధర ఇవాళ 1,37,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,060 తగ్గి రూ.1,26,320 దగ్గర ఆగింది. అయితే వెండి మాత్రం కేజీ రూ.1,500 పెరిగింది. దీంతో ఇవాళ రూ.2,37,000కి చేరింది.
News January 1, 2026
ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.
News January 1, 2026
ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.


