News August 6, 2024
ప్రైవేటీకరణ జాబితాలో తిరుపతి విమానాశ్రయం

కేంద్రం రూపొందించిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో దేశవ్యాప్తంగా చేర్చిన 25 విమానాశ్రయాల్లో తిరుపతి ఉన్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికే లీజుకు ఇస్తున్నామన్నారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని AAI దేశంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు.
Similar News
News March 12, 2026
‘గ్యాస్ సరఫరా’పై చిత్తూరు SP సీరియస్ వార్నింగ్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
News March 12, 2026
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది కష్టమే.!

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుందని AACPC ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి.ప్రతిమ తెలిపారు. వేడి గాలులతో పాటు తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతతోపాటు, గతేడాది కన్నా 1.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తేమ శాతం అందించే పంటలతో పాటు వేడిని తట్టుకోగల పంటలు వేసుకోవాలని Way2News ద్వారా ఆమె సూచించారు. మీ ప్రాంతంలో ఎండలు పెరిగాయా?
News March 12, 2026
చిత్తూరు: వంట గ్యాస్ కోసం పరుగులు.!

రొంపిచర్ల మండలంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వినియోగదారులతో గ్యాస్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమో అని జాగ్రత్తలు పడుతున్నారు. రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో వంటగ్యాస్ కోసం ఆరాటపడుతున్నారు. బుక్ చేసి OTP చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు. మరి కొంత మంది నెట్వర్క్ పనిచేయక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు.


