News August 6, 2024
ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

అద్దె ఇల్లు కావాలని, ఇంట్లోకి చొరబడి దాడికి దిగి మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీకి పాల్పడ్డ ఘటన ఒంగోలు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు అందింది.
Similar News
News September 17, 2025
ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.
News September 17, 2025
S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.
News September 17, 2025
తల్లి ప్రేరేపనతోనే భార్యను హింసించిన భర్త: బంధువులు

ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడుకు చెందిన బాలాజీ భార్య భాగ్యలక్ష్మిని <<17730782>>భర్త విచక్షణారహితంగా కొట్టి<<>>న విషయం తెలిసిందే. కాగా వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఓ బేకరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన భర్త తనతల్లి ప్రేరేపనతో భార్యను హింసిస్తుంటాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.