News August 6, 2024
యూకేలోని భారతీయులకు అలర్ట్!

యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లండన్లోని భారత హై కమిషన్ అప్రమత్తమైంది. భారత్ నుంచి వచ్చినవారు యూకేలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పోలీసుల సూచనలు పాటించాలని, గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే inf.london.@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.
Similar News
News April 18, 2026
అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.
News April 18, 2026
భారత నౌకలపై IRGC కాల్పులు!

హార్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.
News April 18, 2026
GOOD NEWS: ఇంటర్ సెకండియర్కూ ఇంప్రూవ్మెంట్

AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని ప్రకటించింది. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఆ సబ్జెక్ట్ రాయొచ్చని, ప్రతి పేపర్లో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామంది. దీనివల్ల మంచి కాలేజీల్లో సీటు రాకపోవడం, ఒత్తిడికి లోనవడం లాంటివి తగ్గే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.


