News August 6, 2024
అధికారులకు భీమవరం MLA హెచ్చరిక

భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పలువురు వ్యాపారులు MLAను కలిసి వారి ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. కొందరు అధికారులు లంచాలు ఇవ్వాలంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని, లేదంటే వ్యాపారానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన MLA.. ఎవరైనా అధికారులు ఇకపై వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News March 9, 2026
భీమవరం వన్టౌన్లో ‘పీజీఆర్ఎస్’: ఎస్పీ

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.
News March 8, 2026
పగో:జిల్లాలో.. జోరుగా బెట్టింగ్..

ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరును ఆసరాగా చేసుకుని బుకీలు పడగ విప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెట్వర్క్ విస్తరించి, యాప్ల ద్వారా యువతకు వల వేస్తున్నారు. రూపాయికి పది వస్తాయని ఆశచూపుతూ బంతి బంతికీ పందాలు కాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే వ్యామోహంతో మధ్యతరగతి యువత, విద్యార్థులు ఈ ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారు.
News March 8, 2026
భీమవరంలో 2కె రన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరంలో ఆదివారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగిన ఈ పరుగును కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక దృఢత్వమే ఆరోగ్యానికి పునాదని, మహిళలందరూ ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


