News August 7, 2024
కడప: ఈనెల 11వ తేదీ వరకు తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు

కడప- విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ మోహన్ దాస్ తెలిపారు . విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 12, 2026
నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News March 12, 2026
కడప జిల్లాలో MSPతో శనగ పంట సేకరణ ఎంతంటే.!

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.
News March 11, 2026
కడప: వీరికి డాక్టరేట్లు ఇవ్వనున్న వైవీయూ

YVU స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డా. శేఖర్. సి. మండేలకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేస్తారన్నారు. వీరి జీవితం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.


