News August 7, 2024

ఆసిఫాబాద్: గర్భిణులను వెంటాడుతున్న రక్తహీనత

image

ఆసిఫాబాద్ జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండేళ్లలో 10 మంది గర్భిణులు మృతిచెందారు. కాగా జిల్లాలో 3,939 మంది గర్భిణులు ఉండగా వారిలో 1,894 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా అందాల్సిన పోషకపదార్థాల్లో నాణ్యత లేకపోవడం, సక్రమంగా పంపిణీ కావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి ప్రసవ సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Similar News

News March 5, 2026

ప్రజాపాలనతోనే అభివృద్ధి: ADB కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జెడ్పీ హాల్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 5, 2026

ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 4, 2026

ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

image

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.