News August 7, 2024
జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రకృత్తి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో మంగళవారం సమీక్షించి మాట్లాడారు. 2047 నాటికి జిల్లా సాధించాల్సిన అభివృద్ధిని తెలిపేలా ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల టూర్ డైరీలను పరిశీలిస్తానని తెలిపారు.
Similar News
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
News January 13, 2026
త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్పోర్ట్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.


