News August 7, 2024
మైదుకూరు: కరెంట్ షాక్తో మహిళ మృతి

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లింగాలదిన్నెలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో ధనికెల చిన్నక్క(28) అనే మహిళ మృతి చెందింది. గ్రామ సమీపంలోని పంట పొలంలో గల విద్యుత్ మోటార్ వద్దకు వెళ్లిన చిన్నక్క ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.
News March 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.
News March 12, 2026
కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ను అందజేస్తామన్నారు.


