News August 7, 2024

విశాఖ: స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు విడుదల

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికారులు ప్రకటించారు. గల్లా పోలిపల్లి, గొలగాని వీరరావు, నూకరత్న, పిసిని వరాహ లక్ష్మి నరసింహం, పిల్లా మంగమ్మ, బల్లా శ్రీనివాసరావు, బొమ్మిడి రమణ, పులి లక్ష్మీ బాయి, విల్లూరి భాస్కర్ రావు, శరగడం రాజశేఖర్ ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. విజేతలందరూ ఎన్డీఏ కూటమి బలపరిచిన వారే కావడం విశేషం.

Similar News

News July 9, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

image

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.

News July 8, 2025

ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

image

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

News July 8, 2025

గిరి ప్రదక్షిణకు మహా ‘గట్టి’ ఏర్పాట్లు సుమా..!

image

గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమంతువాక నుంచి వెంకోజీపాలెం వరకూ జాతీయ రహదారిపై పాదచారుల కోసం చేసిన ఏర్పాటు చూస్తే.. చిన్న పాటి కర్ర పాతి, దానికి సన్నని రిబ్బన్ కట్టి, వాహనాలు ఇటు రాకుండా, పాదచారులు అటు వెళ్లకుండా విభజన చేశారు. లక్షల్లో నడిచే ఈ దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత ‘గట్టి’ ఏర్పాట్లు చేసిన అధికారులను ఎలా అభినందించాలో తెలియడం లేదంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.