News August 7, 2024
తెలంగాణకు మరో కంపెనీ

US పర్యటనలో ఉన్న CM రేవంత్ రెడ్డి మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా TGని తీర్చిదిద్దడంతో ఈ సంస్థ భాగస్వామి కానుంది. ఇది 2025 నుంచి రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్లను ఉత్పత్తి చేయనుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్లను ఉపయోగిస్తారు.
Similar News
News March 3, 2026
కలెక్టర్లూ ఇదేం తీరు… CM సీరియస్

TG: అధికారుల పనితీరుపై CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో భూ వివాదాలకు కలెక్టర్లే కారణమని అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలో ఉండకుండా HYD నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ముగ్గురు కలెక్టర్లపై మండిపడ్డారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేశామని, ఇంకా మారకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ల కాన్ఫరెన్సులో హెచ్చరించారు.
News March 3, 2026
సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.
News March 3, 2026
ఫేస్ రికగ్నిషన్తోనే ఇకపై పథకాలు: CM

TG: అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3L మంది అనర్హులను తొలగించగలిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.


