News August 8, 2024
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష

ఏలూరు కలెక్టరేట్లో బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కిషోర్ అధికారులతో సమీక్షించారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 15వ తేదీ ఉదయం 9గం నుంచి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News October 24, 2025
రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.
News October 24, 2025
స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.
News October 24, 2025
తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.


