News August 8, 2024
53 నుంచి 50 కేజీల విభాగంలోకి మారడం వల్లే..: అదిల్

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ విషయంలో ఎలాంటి కుట్ర జరగలేదని భారత అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్ సుమరీవాలా అభిప్రాయపడ్డారు. ‘వినేశ్ ఎప్పుడూ 53 కేజీల విభాగంలో పోటీ పడేవారు. తాజాగా 50 కేజీల విభాగంలోకి మారారు. దీంతో ఈ సమస్య వచ్చింది. అధిక బరువు విషయంలో ఎలాంటి సడలింపు లేదు. రూల్ రూలే’ అని స్పష్టం చేశారు. కాగా, తొలి పోటీకి ముందు 49.900 కేజీల బరువు ఉన్న ఫొగట్.. సెమీస్ ముగిశాక 52.800 గ్రా.కు చేరారు.
Similar News
News March 22, 2026
కుల మీటింగ్స్కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.
News March 22, 2026
మార్చి 22: చరిత్రలో ఈరోజు

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం
News March 22, 2026
బల్బ్లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

గుజరాత్లోని రాజ్కోట్లో ఒక డాక్టర్ తన కొలీగ్పై ఉన్న వన్ సైడ్ లవ్తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.


