News August 8, 2024
BREAKING: కర్నూలు జిల్లాలో భారీగా SIల బదిలీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 44 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరుగురిని నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు, మరో ఇద్దరిని కడప, చిత్తూరు నుంచి కర్నూలుకు బదిలీ చేశారు. అటు కర్నూలు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది ఎస్సైలను వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులిచ్చారు.
Similar News
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
News March 2, 2026
చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 103 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసాలు, ఆస్తి వివాదాలు, రుణ చెల్లింపుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన వినతులను అధికారులు నమోదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


