News August 8, 2024
జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు

ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.
Similar News
News September 18, 2025
ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
News September 18, 2025
గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.