News August 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి బి.టెక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్‌అంబేడ్కర్ యూనివర్సీటీ బీటెక్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఆగష్టు 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800 ప్రాక్టికల్, వైవా రూ.250 ఫీజుతో కలిపి మొత్తం రూ.1,050 లను చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధి రుసుముతో 16 వరకు రూ.2000 అపరాధ రుసుముతో 17 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.

Similar News

News July 7, 2025

నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

image

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2025

శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

image

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.