News August 8, 2024
వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థిరాస్తులివే!

వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా 8,72,324 ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లో 27%( 2,32,547), బెంగాల్లో 9%(80,480), తెలంగాణలో 5% (45,682) ప్రాపర్టీలు కలిగి ఉంది. ఈ డేటాను వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది.
Similar News
News December 26, 2025
మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.
News December 26, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
భారత్ ఘన విజయం

శ్రీలంక ఉమెన్స్తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.


