News August 9, 2024

భారత్‌కు ఈ సారి ‘గోల్డ్’ లేనట్లేనా?

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బంగారు ఆశలు ఆవిరవుతున్నాయి. ఫేవరెట్లు విఫలమవడం, గత ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా ఈ సారి సిల్వర్‌కే పరిమితం కావడంతో దాదాపు ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇకపై జరిగే మ్యాచుల్లో మెడల్ ఫేవరెట్లు లేరు. రెజ్లర్ వినేశ్ ఫొగట్ గెలుస్తారని భావించినా దురదృష్టం ఆమెను వెంటాడింది. దీంతో గోల్డ్ లేకుండానే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తన ప్రస్థానం ముగించే పరిస్థితి ఏర్పడింది.

Similar News

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

News March 12, 2026

క్యాప్ జెమినీ సీఈవోతో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: విశాఖలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సిటీలో ఆ సంస్థ పెట్టుబడులపైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 20వేల ఉద్యోగాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థను లోకేశ్ కోరారు. భూకేటాయింపులపై ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్‌లో 20ఎకరాలు పరిశీలించగా.. అడవివరం, ఆనందపురంలోని భూములను కూడా ప్రతినిధులు పరిశీలించారు.