News August 9, 2024

పాలమూరులో జాతీయ రహదారులకు రూ.1,205.9 కోట్లు

image

పాలమూరులో హైవేల నిర్మాణానికి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,205.975 కోట్లు కేటాయించింది. MBNR-చించోళి రోడ్డు నిర్మాణానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో కొడంగల్‌ వరకు రూ.379.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాలమూరులో ఇప్పటికే హైవే పనులు జరుగుతున్నాయి. దీంతో HYD-బెంగళూరు హైవేపై ఉన్న 37 బ్లాక్‌ స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల అండర్‌పాసు లేదా సర్వీసు రోడ్లు నిర్మించే అవకాశాలున్నాయి.

Similar News

News November 9, 2025

చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.

News November 9, 2025

MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.

News November 9, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.