News August 9, 2024
డెంగ్యూతో చేరితే మలేరియాకు చికిత్స.. విశాఖలో యువకుడు మృతి

డెంగ్యూతో ఆసుపత్రిలో చేర్పించిన తమ కుమారుడు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడని విశాఖకు చెందిన తిప్పిన రమణారెడ్డి, రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుష్ రెడ్డి డెంగ్యూ జ్వరంతో అక్కయ్యపాలెంలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. మలేరియా జ్వరానికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పరిస్థితి విషమించింది. దీంతో వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందేలోపే మరణించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
Similar News
News March 6, 2026
విశాఖ నగరంలో నీటి సరఫరా ఎంతంటే..?

నగరంలో నీటి వినియోగం లభ్యత విషయాలపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. 24 లక్షల జనాభాకు గత ఏడాది నుంచి 453MLD అవసరం కాగా 390MLD సరఫరా జరుగుతుందని, భవిష్యత్తులో వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని తెలిపారు. రీసైక్లింగ్ పద్ధతిలో నీటిని వాడుకునే విధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.


