News August 9, 2024
ఒంగోలు: ఆదివాసీ దినోత్సవాల్లో ఎమ్మెల్యే కందుల

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లోభాగంగా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.
Similar News
News March 14, 2026
కనిగిరి: పాపం.. ఈ కష్టం ఏ తల్లికీ రాకూడదు..!

ఇటీవల S.కొండలోని నవోదయ కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో కనిగిరికి చెందిన తౌషిక్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తౌషిక్ తల్లి మౌలాబి శుక్రవారం కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయిందని బంధువులు ఆందోళన చెందారు. సాయంత్రం వేళలో శ్మశానవాటికలోని తౌషిక్ సమాధి వద్ద పడుకొని ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఆమెను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
News March 13, 2026
పవన్ ‘ఫ్లాప్ స్టార్’: MLA తాటిపర్తి

యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా DyCM పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాల్లో ‘పవర్ స్టార్’ బిరుదు ఎలా వచ్చిందో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో మాత్రం ఫ్లాప్ స్టార్ అయిపోయారని ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో అటవీ శాఖ ద్వారా కేవలం రూ.83 కోట్ల సంపద మాత్రమే సృష్టించారని, ఆ డబ్బు కూడా షూటింగ్ ట్రిప్పులకే ఖర్చు అయిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు.
News March 13, 2026
ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.


