News August 9, 2024
‘సినిమా చెట్టు’కు ట్రీట్మెంట్.. 45 రోజుల్లో చిగుర్లు..!

కొవ్వూరు మండలం కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ పునరుజ్జీవ ప్రక్రియ చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో నిపుణులు కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. 45 రోజుల తర్వాత చిగుర్లు వస్తాయని పేర్కొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇలా 10 చెట్లకుపైగా చిగురింపజేశామన్నారు. ఈ చెట్టు అంటే తనకు ప్రాణమని, దాన్ని బతికిస్తే ఎక్కువ నిడివితో మళ్లీ ఓ పెద్ద సినిమా తీస్తానని డైరెక్టర్ వంశీ తెలిపారు.
Similar News
News December 26, 2025
నరసాపురం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో భాగంగా మైక్ సెట్ కడుతూ జెట్టిపాలెం గ్రామానికి చెందిన శీలం అభిరామ్ (19) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. చెట్టుపై మైక్ అమర్చుతుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 25, 2025
ఆడుకోమని వదిలిన తండ్రి, కొద్దిసేపటికే విగత జీవిగా కొడుకు

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
News December 25, 2025
ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


