News August 10, 2024

నిజామాబాద్ జిల్లాకు 13 ఎలక్ట్రిక్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి RTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని పనులు మిలిగి ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి 11 ఛార్జింగ్ పాయింట్లు పూర్తయ్యాయి. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని అర్టీసీ అధికారులు ప్రకటించారు.

Similar News

News February 6, 2025

KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!

image

సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.

News February 6, 2025

నిజామాబాద్‌లో చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.220 నుంచి రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.210 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. అయితే, బాన్సువాడలో వైరస్ ప్రభావంతో కామారెడ్డిలో KG రూ. 180కి పడిపోవడం గమనార్హం. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?

News February 6, 2025

NZB: రుణాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి: సెర్ఫ్ డైరెక్టర్

image

స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్న ఆదాయ వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని సెర్ఫ్ డైరెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీపీఎం, ఎపీఎం, సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామస్థాయిలో పనిచేసే అసిస్టెంట్లకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సాయ గౌడ్, జిల్లాల అధికారులున్నారు.

error: Content is protected !!