News August 10, 2024
మార్కాపురంలో మూడు రంగుల అరుదైన పక్షి

మార్కాపురం పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని చెట్టుపై శుక్రవారం మునియా పక్షి దర్శనమిచ్చింది. మూడు రంగులలో పక్షి ఉండటంతో దీనిని త్రివర్ణ మునియా అంటారని అటవీశాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు. కనిపించకుండా పోతున్న జాతుల్లో త్రివర్ణ మునియా జాతి ఒకటని అన్నారు. కళాశాల ప్రాంగణంలో చెట్లపై ఈ పక్షిని గమనించిన విద్యార్థులు వింతగా చూశారు.
Similar News
News December 29, 2025
ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.


