News August 10, 2024

చిత్తూరులో 13న జాబ్ మేళా

image

చిత్తూరు నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కరూర్ వైశ్య బ్యాంకు, ఎన్ఎస్ ఇన్స్ట్రూమెంట్స్ కంపెనీలలో పలు పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News March 7, 2026

చిత్తూరు జిల్లాలో 250 మంది ట్రాన్స్‌ఫర్

image

చిత్తూరు పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం చేపట్టారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది వరకు ఏఎస్ఐలు ఉన్నారు. ఒకే స్టేషన్లో మూడేళ్లుగా పనిచేస్తున్న వాళ్ల నుంచి ఐదేళ్ల పాటు పనిచేస్తున్న సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

News March 6, 2026

చిత్తూరు జిల్లాలో రూ.24కోట్ల టార్గెట్..!

image

చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో పన్నుల వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 622 పంచాయతీలు ఉన్నాయి. రూ.24 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్ల రాబట్టారు. ఈనెల 15వ తేదీలోపు మరో రూ.6 కోట్ల వసూళ్లే లక్ష్యంగా సిబ్బంది గ్రామాల్లో తిరిగి రాబడుతున్నారు.

News March 6, 2026

టెన్త్ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు: DEO

image

టెన్త్ పరీక్షల కోసం చిత్తూరు జిల్లాలో 129 కేంద్రాలు ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 23,095 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.