News August 10, 2024

HYD: ప్రజలను తప్పుదారి పట్టిస్తోన్న KTR, హరీశ్‌రావు: SRR 

image

బోగస్ స్టేట్‌మెంట్లతో KTR, హరీశ్‌రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ మీడియా కమిటీ తెలంగాణ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. HYD గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి నైజం మాత్రం మారలేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నీటి విషయంలో వారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 

Similar News

News December 28, 2025

HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

image

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.

News December 28, 2025

సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

image

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!

News December 28, 2025

సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

image

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!